తొలి రౌండ్‌లోనే ఓడిన భారత మేటి షట్లర్‌

తొలి రౌండ్‌లోనే ఓడిన భారత మేటి షట్లర్‌

విశ్వవిజేతగా పేరు సంపాదించిన స్టార్‌ ప్లేయర్‌ సింధుకు తన ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదురవ్వడం వల్ల వరుస పరాజయాలు చవిచూస్తుంది. పీవీ సింధు చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఆరో సీడ్‌ తొలి రౌండ్‌లోనే ఓటమి పాలైంది.

74నిమిషాల పాటు జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ప్రత్యర్థి పాయ్‌యుపో తో 13–21, 21–18, 19–21 తేడాతో సింధు పరాజయం పాలైంది. ఇంతకు ముందు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్‌లో పాయ్‌యుపో పై విజయం సాదించిన సింధు ఇపుడు పాయ్‌యుపో చేతిలో ఓడిపోయింది. విశ్వ విజేతగా ఆగస్టులో పేరు సాదించిన సింధు పాల్గొన్న ఐదు టోర్నీల్లో క్వార్టర్‌ ఫైనల్‌ కూడా చేరుకోలేదు