సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌కు చెందిన స్మృతిరేఖా ఫరీదా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. గౌలిదొడ్డిలో సాయిసదన్‌ పీజీ విమెన్స్‌ హాస్టల్‌లో నివాసముంటోంది.

సోమవారం ఉదయం సహచర ఉద్యోగి జాన్‌కు ఫోన్‌ చేసింది. నాకు బతకాలని లేదంటూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో హాస్టల్‌ నిర్వాహకులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.