19 మంది యువతుల పరారీ

19 మంది యువతుల పరారీ

హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న పలు గృహాల్లో ఇటీవల హ్యూమన్ ట్రాఫికింగ్ రెస్క్యూ టీమ్ దాడులు చేసింది. అందులో ఉన్న 14 మంది మహిళలను అదుపులోకి వారు తీసుకున్నారు. వీరిలో 19 నుంచి 25 సంవత్సరాల వయసు గల మహిళలు ఉన్నారు. అయితే కోర్టు ఆదేశంతో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేంద్రనగర్ హైదర్ షాకోట్ కస్తూర్భా గాంధీ అనాథాశ్రమంలో చేర్పించారు.

వీరి పరివర్తనలో మార్పు తేవాలని, సమాజంలో గౌరవంగా బతికేలా చేయాలని వీరికి అక్కడ 20 రోజులుగా శిక్షణ ఇస్తున్నారు. అయితే అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ 14 మంది మహిళలు పక్కా ప్లాన్ వేసి ఆశ్రమంలోని బాత్రూం వెంటిలేటర్ విరగ్గొట్టి, ప్రహరీ గోడను సైతం దూకి పారిపోయారు.

ఈ క్రమంలోనే ఉదయం వీరు కనిపించకపోవడంతో సీసీ ఫుటేజీలు పరిశీలించగా ఈ సంఘటన బయటపడింది. దీంతో ఆశ్రమం నిర్వాహకులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన మహిళల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.