తెలంగాణ కుంభమేళా

తెలంగాణ కుంభమేళా

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.. ఈసారి జాతరను ఎంతో ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం సమ్మక్క సారక్క జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఈ జాతరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మేడారం జాతర కోసం ప్రత్యేకంగా 3,845 బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి మేడారం జాతరకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతామని వెల్లడించారు.

మరోవైపు ఈ మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో శానిటేషన్‌ వంటి ఏర్పాట్లపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే 3,845 బస్సులు నడపనుండటంతో మేడారంలో 50 ఎకరాల్లో భారీ బస్టాండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం..

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.. ఈసారి జాతరను ఎంతో ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం సమ్మక్క సారక్క జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఈ జాతరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మేడారం జాతర కోసం ప్రత్యేకంగా 3,845 బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి మేడారం జాతరకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతామని వెల్లడించారు.

మరోవైపు ఈ మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో శానిటేషన్‌ వంటి ఏర్పాట్లపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే 3,845 బస్సులు నడపనుండటంతో మేడారంలో 50 ఎకరాల్లో భారీ బస్టాండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం..