ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్‌ కసిరెడ్డికి నిరాశ

ఏపీ మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam) ప్రధాన నిందితుడు రాజ్‌ కసిరెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ రాజ్ కసిరెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు జస్టిస్ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. కసిరెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. తన కొడుకు అరెస్ట్ సమయంలో నిబంధనలు పాటించడం లేదంటూ కసిరెడ్డి తండ్రి ఉపేందర్‌ రెడ్డి వేసిన పిటిషన్‌ను కూడా తోసిపుచ్చింది. ఈ రెండు పిటిషన్లపై గత సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు దానికి సంబంధించిన తీర్పును వెల్లడించింది. అరెస్ట్ సక్రమమా కాదా అనేదానిపై మెరిట్స్‌లో వెళ్లకుండా ఈ కేసును పూర్తిగా డిస్పోస్ చేస్తున్నామని తీర్పులో పేర్కొంది.