ప్రియుడితో కలిసి భర్త మర్డర్ కు ప్లాన్…కానీ…!

Tamilnadu Woman Lover Held For Attacking Hubby Staging A Robbery

రోజురోజుకీ ప్రియుళ్ళతో కలిసి భర్తలను అడ్డుతొలగించుకుని చెలరేగిపోతున్న మహిళలు ఎక్కువయిపోయారు. తన ప్రియుడిని వదిలి ఉండలేని ఓ నవ వధువు, అతనితో కలసి భర్తను హతమార్చేందుకు ప్లాన్ వేసి విఫలమై, పోలీసులకు చిక్కింది. మరిన్ని వివరాల్లోకి వెళితే చెన్నై శివార్లలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కదిరవన్ (30)కు నెల రోజుల క్రితం తూత్తుకుడికి చెందిన అనిత (25)తో వివాహమైంది. ఆపై గత వారాంతంలో వారు సముద్ర తీరానికి వారు వ్యాహ్యాళికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరి బైకును అడ్డుకున్న ఇద్దరు కదిరవన్ పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనిత ధరించిన 12 సవర్ల నగలు, రూ. 1000 తీసుకుని పరారయ్యారు.

attack-robary
అయితే తీవ్రగాయాలతో పడివున్న కదిరవన్ ను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించిన అనిత, పోలీసులకు తానే స్వయంగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. కదిరవన్ పై దాడి జరుగుతున్న సమయంలో అనిత ఏ మాత్రం దాడి ని ఆపకపోవదాన్ని గమనించిన పొలేఉస్లు ఆమెను తనదైన శైలిలో విచారించారు. దీంతో ఆసలు నిజం బయటకు వచ్చింది. కాలేజీలో చదువుతున్న సమయం జగన్ అనే యువకుడిని ప్రేమించానని, అయితే, తాము పెళ్లి చేసుకోవాలని భావించిన సమయంలో తనకు కదిరవన్ తో పెళ్లి చేశారని చెప్పింది. దుండగుల దాడి జరిగినట్టుగా ప్లాన్ చేశానని, ఆపై తామిద్దరమూ కలసి జీవిద్దామని భావించామని చెప్పింది. ఆమెను విచారించిన తరువాత పోలీసులు మధురైలో ఉన్న జగన్ ను కూడా అరెస్ట్ చేసి, ఇద్దరినీ కటకటాల వెనక్కు నెట్టారు.

attack