Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పినా కేంద్రం మీద తెలుగుదేశం యుద్ధం ప్రకటించి ఎన్డీయే ప్రభుత్వం నుండి బయటకి వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే విభజన హామీల అమలు మీద కేంద్రం వ్యక్తం చేస్తున్న వైఖరికి నిరసనగా టీడీపీ కొద్ది రోజులుగా రకరకాల నిరసనలు కూడా తెలుపుతోంది, పార్లమెంట్ జరిగినన్నాళ్ళు ఎంపీలు, ఇప్పుడు కార్యకర్తలు నేతలతో నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. నిన్న మొన్నటి దాకా మోడీని ఏమనని చంద్రబాబు కూడా మోడీ మీద యుద్ధం ప్రకటించేసారు. ఈరోజు అమరావతిలో అందుబాటు లో ఉన్న మంత్రుల్తో భేటీ అయిన బాబు ఈ మేరకి నిర్ణయం తీసుకున్నారు.
అయితే రోజుకో రీతిలో నిరసన తెలియచేస్తున్నా తెలుగు దేశం నాయకులు ఈరోజు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఏలూరు ఎంపీ మాగంటి బాబు – ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఒకరినొకరు కొరడాలతో కొట్టుకుంటూ వినూత్న తరహాలో నిరసన తెలిపారు. బీజేపీకి మద్దతిచ్చి తప్పు చేశామంటూ ఎంపీ ఎమ్మెల్యే ఒకరినొకరు కొరడాలతో కొట్టుకుని నిరసన తెలిపారు. 5 కోట్ల ఆంధ్రులను ప్రధాని మోదీ మోసం చేశారని ఏపీ నుంచే మోదీ పతనం ప్రారంభమైందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. అయితే తెలుగుదేశం నిర్వహిస్తున్న ఈ నిరసనల వాళ్ళ తెలుగుదేశానికి మద్దతు పెరుగుతోంది. నాలుగేళ్ళుగా మంచిని నటిస్తూ వచ్చిన మోడీ ఒక్కసారిగా తన బుద్ధి బయట పెట్టుకున్నాడని ప్రజలు మండిపడుతున్నారు.