లవర్ మోసం…సూసైడ్ చేసుకున్న యువకుడు మృతి 

లవర్ మోసం...సూసైడ్ చేసుకున్న యువకుడు మృతి 

ప్రేమ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రేమ పిచ్చిది, గుడ్డిది, ప్రాణాలు కూడా తీస్తుందనడానికి..  గత మూడురోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందిన యువకుడి కథే ఓ ఉదాహరణ. అమ్మాయిలకు బాసటగా చట్టాలు, షీ టీంలు వుండి వారికి రక్షణ ఇస్తుంటే, అమాయకపు యువకుడైన తమ కుమారుడు ప్రేమ దాహనికి బలైతే, అమ్మాయిలకు అనుకూలంగా ఈ చట్టాలు ఎందుకని తమ బందువులు బోరున విలపిస్తున్నారు. ప్రియురాలు మోసం చేసిందని ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సరిగ్గా మూడురోజుల క్రితం సెప్టెంబర్ ఒకటో తేదీన పెద్దపెల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

అంతేకాదు తను సూసైడ్ అటెంప్ట్ చేసేముందు ఆ యువకుడు తన ప్రేమలో ఏం మోసం జరిగిందో వివరిస్తూ.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియా లో సంచలనం సృష్టించింది.  సుల్తానాబాద్ మండలం పెరికపల్లి గ్రామానికి చెందిన నలువాల మధు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతి తనను ప్రేమ పేరుతో  మోసం చేసిందని  పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

తన ప్రియురాలు మోసం చేసిన విషయం సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యాయత్నం చేసిన మధును పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆసుపత్రికి   తరలించారు. అయితే ఆ మధు ఈరోజు చికిత్స పొందుతూ కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందడంతో ఇప్పుడా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అమాయకుడైన మధు ప్రేమ ఉచ్చులో పడి తన ఉద్యోగం పోగొట్టుకొని…. అమ్మాయి వలపుల వలకు బలైనాడని అమ్మాయిలకు రక్షణగా ఇన్ని చట్టాలుండి అమాయకులైన యువకుల ప్రాణాలను హరిస్తున్నాయని యువకుల తప్పు లుంటే  వారికి కఠిన శిక్షలు వేసే చట్టాలు, యువతులు తప్పులు చేస్తే ఎందుకు శిక్షంచవని మధు బందువులు ప్రస్నిస్తునారు.