టీబీజేపీకి ఆ మీటింగ్ టెన్షన్

Telangana BJP leaders tension With CM KCR And Pm Modi Meetings

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కేసీఆర్ తో బీజేపీకి కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఓవైపు అమిత్ షా ను బండ బూతులు తిడుతున్న కేసీఆర్.. అదే నోటితో ప్రధాని మోడీని పొగుడుతున్నారు. మోడీ పాలనలో ఒక్క స్కామ్ కూడా లేదని కితాబిచ్చారు కేసీఆర్. ఇప్పుడు తనతో మోడీ ఏకాంతంగా ప్రస్తావించిన అంశాల్ని మీడియాకు చెప్పేస్తున్నారు.

ఏ సీఎం కూడా ప్రధాని, రాష్ట్రపతి వంటి పెద్దలతో ఏకాంతంగా మాట్లాడిన విషయాలు ఎవరితో పంచుకోరు. కానీ కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్థులతో మైండ్ గేమ్ ఆడటానికి ప్రధానిని కూడా ముగ్గులోకి లాగుతున్నారు.

నిజంగా ప్రధాని అన్నరా.. లేదంటే కేసీఆర్ మసాలా వేస్తున్నారా అనేది టీబీజేపీ నేతలకు అర్థం కావడం లేదు. ఢిల్లీ నుంచి క్లారిటీ తీసుకున్న కాషాయ నేతలు కేసీఆర్ పై మండిపడుతున్నారు. ప్రధాని స్థాయి వ్యక్తికి గౌరవం ఇవ్వకుండా.. ఆయన చెప్పినవన్నీ బహిరంగపరచడం మర్యాద కాదని మండిపడుతున్నారు. కానీ అసలు కేసీఆర్ తో మోడీ అంత ఏకాంతంగా మాట్లాడటమే కొంప ముంచుతోందని అభిప్రాయపడుతున్నారు

మరిన్ని వార్తలు:

మేకిన్ ఇండియా పరువు తీశారు

అవినీతికి దగ్గరవుతున్న రాహుల్

బెజవాడలో ఐఏఎస్ సిస్టర్ మిస్సింగ్