పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

మీర్‌పేట్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సర్వోదయ నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. తండ్రి మందలించాడని పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. బాలిక తరుచూ మొబైల్‌లో గేమ్స్‌ ఆడుతూ ఉండేది. ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి వరకు మొబైల్ ఫోన్‌తో విద్యార్థిని గేమ్స్ ఆడుతుండగా పడుకోమని తండ్రి మందలించాడు.

దీంతో ఆ బాలిక తీవ్ర మనస్థాపానికి గురైంది. అందరూ పడుకున్న తర్వాత ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని ఉస్మానియ ఆసుపత్రికి తరలించారు. కూతురు మరణంతో బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.