TG Politics: ప్రతిపక్షం గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్నారు: గులాబీ నేతలు

TG Politics: Opposition trying to strangle: Rose leaders
TG Politics: Opposition trying to strangle: Rose leaders

BRS ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు రేవంత్ కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుతుండగా మీడియా పాయింట్ వద్ద మాట్లాడొద్దు అంటూ కొత్త రూల్స్ పెట్టబోతున్నారట. ఇటీవల అసెంబ్లీలో కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో BRS ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి మీడియా పాయింట్ వద్ద మాట్లాడడానికి ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు.

ప్రతిపక్షం గొంతు నొక్కడం ఏమిటని ప్రజల్లో చర్చ జరగడంతో ఇకపై అసెంబ్లీ సమావేశాలు జరుతుండగా మీడియా పాయింట్ వద్ద ఎవరూ మాట్లాడొద్దు అంటూ స్పీకర్ కొత్త రూల్ పాస్ చేశాడు. మరి దీనిపై గులాబీ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గతంలో తాము ప్రతిపక్షం గొంతు నొక్కడానికి ఎక్కడా ప్రయత్నించలేదని..స్వేచ్ఛ ఇచ్చామని గులాబీ నేతలు చెబుతున్నారు.