‘యానిమ‌ల్’ నిర్మాత ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది …!

There is a great tragedy in the house of the producer of 'Animal'...!
There is a great tragedy in the house of the producer of 'Animal'...!

బాలీవుడ్ హీరో ర‌ణ్ బీర్ క‌పూర్ న‌టించిన ‘యానిమ‌ల్’మూవీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ది మోస్ట్ వ‌యొలెంట్ సినిమా గా ఇది ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ములేపింది. ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ ఈ మూవీ తో సృష్టించిన విధ్వంసం అంద‌రికీ తెలిసిందే. క‌ల్ట్ క్లాసిక్ సినిమా గా బాలీవుడ్ జ‌నాల‌ని ఈ మూవీ ఆకట్టుకుంది. అయితే, ఈ మూవీ నిర్మాత‌ల్లో ఒక‌రైన కృషన్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది .

టీ-సిరీస్ చైర్ ప‌ర్సన్ కృష‌న్ కుమార్ కూతురు తిషా కుమార్ 20 ఏళ్ల వ‌యసులోనే ఆమె మృతిచెందింది. క్యాన్సిర్ బారిన ప‌డిన తిషా కుమార్ కి జ‌ర్మ‌నీలో అత్యాధునిక వైద్యం కూడా అందించారు. కానీ, ప‌రిస్థితి చేదాటిపోవ‌డంతో తిషా చికిత్స పొందుతూ జూలై 18న‌ మృతి చెందిన‌ట్లుగా వైద్యులు ధృవీక‌రించారు.

ఇక టీ-సిరీస్ యాజ‌మాన్యం కూడా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. దీంతో నిర్మాత ఇంట‌ విషాదం అలుముకుంది. బాలీవుడ్ కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు వారికి త‌మ సంతాపం తెలుపుతున్నారు.