మూడో టీ20 మ్యాచు వర్షం అంతరాయం..

Third T20 match interrupted by rain
Third T20 match interrupted by rain

భారత్, ఐర్లాండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ జరుగుతున్న డబ్లిన్ స్టేడియం వద్ద భారీ వర్షం కురుస్తోంది. దీంతో టాస్ కూడా సాధ్యం కాలేదు. వర్షం తగ్గితే టాప్ వేసే అవకాశం ఉంది. కాగా మూడు టీ20ల సిరీస్ లో భారత్ ఇప్పటికే 2 మ్యాచ్లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. గాయాల నుంచి కోలుకుని పునరాగమనం చేసిన పేస్‌ బౌలర్లు ప్రసిద్ధ్‌ కృష్ట, జస్‌ప్రీత్‌ బుమ్రా ఫిట్‌నెస్‌ను నిరూపించు‌కున్నారు.టీమిండియా మరోవైపు రిజర్వ్‌ ఆటగాళ్లను పరీక్షించేందుకు ఈ మ్యాచ్‌ నామమాత్రమైన వాడుకోనుంది.

జితేశ్‌ శర్మ,అవేష్‌ ఖాన్‌,షాబాజ్‌ అహ్మద్‌ ఇప్పటివరకు సిరీస్‌లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. నిజానికి విండీస్‌ పర్యటనలోనూ జట్టులో ఉన్న అవేష్‌ ఖాన్ మొత్తంగా వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో బెంచ్‌కు పరిమితం కావాల్సివచ్చింది. ఈ నేపథ్యంలో నిలకడగా రాణించలేకపోతున్న అర్ష్‌దీప్‌ సింగ్‌ స్థానంలో అతన్ని తుది జట్టులోకి తీసుకునే చాన్స్ ఉంది. సంజు శాంసన్‌కు విశ్రాంతినిచ్చి,జితేశ్‌ శర్మను వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వొచ్చు. దేవధర్‌ ట్రోఫీలో షాబాజ్‌ అహ్మద్‌ విశేషంగా రాణించి ఆత్మవిశ్వాసంతో భారత్‌కు మరో ఆల్‌రౌండ్‌ ప్రత్యామ్నాయం ఉన్నాడు. వాషింగ్టన్‌ సుందర్‌కు విశ్రాంతి కల్పించి షాబాజ్‌ను ఆడించే అవకాశాలు కూడా ఉన్నాయి.