గిరిజన మ్యూజియాలు

గిరిజన మ్యూజియాలు

ఏపీ తెలంగాణల్లోనూ గిరిజన మ్యూజియాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. సోమవారం మణిపూర్‌లో రాణిగైడిన్లు గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియంకు వర్చువల్‌ ద్వారా అమిత్‌ షా భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన మ్యూజియాలకు రూ.195 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్‌లకు రూ.110 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.