మైత్రివనంలో 20 కోచింగ్‌ సెంటర్లు సీజ్‌

twenty coaching centers seized in mythrivanam

హైదరాబాద్‌ నగరంలోని అమీర్‌పేట మైత్రివనంలో గల 20 కోచింగ్‌ సెంటర్లను అధికారులు సీజ్‌ చేశారు. కోచింగ్‌ సెంటర్లపై జీహెచ్‌ఎంసీ అధికారులు రైడ్‌ చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అగ్నిమాపక నిబంధనలు పాటించని 20 కోచింగ్‌ సెంటర్లను అధికారులు సీజ్‌ చేశారు. తనిఖీల సందర్భంగా గతంలో నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో అధికారులు తాజాగా రైడ్‌ చేసి సీజ్‌ చేశారు.