సూపర్స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రియాంకా చోప్రా జోనస్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ కలయికలో గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ అంతర్జాతీయ స్థాయిలో అత్యంత అంచనాలు నెలకొన్న ప్రాజెక్ట్గా నిలుస్తోంది. పాన్ వరల్డ్ లెవెల్లో ఒక భారతీయ చిత్రంపై ఇంత ఆసక్తి నెలకొనడం నిజంగా అపూర్వమైన విషయం.

ఇటీవల కాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో వారణాసి ప్రెజెన్స్ కనిపించకపోవడంతో పలు వ్యాఖ్యలు వినిపించాయి. అయితే మేకర్స్ దానికి బదులుగా మరో పవర్ఫుల్ ప్లాన్తో ముందుకు వచ్చారు. మెక్సికోలో జరగనున్న ప్రతిష్టాత్మక కామిక్ కాన్ ఎక్స్పీరియన్స్ ఈవెంట్లో ఏప్రిల్ 24న నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ హాజరు కానున్నారు. అక్కడ ‘వారణాసి’ ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ స్క్రీనింగ్ చేయనున్నారని తెలుస్తోంది. దీంతో వారణాసి పేరు మరోసారి వరల్డ్వైడ్ మార్కెట్లో గట్టిగా రెసొనేట్ అవుతుందని చెప్పవచ్చు.
ఎంఎం కీరవాణి సంగీతం మరియు కేఎల్ సత్యనారాయణ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ‘వారణాసి’ అంతర్జాతీయ సినీ రంగంలో భారతీయ సినిమాకు కొత్త గుర్తింపు తీసుకొస్తుందని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.
