విప్లవ కవి శ్రీశ్రీ బొమ్మగీసిన హాస్యబ్రహ్మం.

టాలీవుడ్ ప్రముఖ కమిడియన్.. బ్రహ్మానందం.. ఓ ప్రముఖ విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు బొమ్మ గీశారు. ఈ లాక్ డౌన్ వేళ హాస్యనటుడు బ్రహ్మానందం తనలో ఉన్న టాలెంట్ బయటకు తీశారు. తనకు ఎంతో ఇష్టమైన కవి శ్రీశ్రీ బొమ్మ గీశారు. బ్రహ్మనందం కుమారుడు గౌతమ్ ఈ విఫయాన్ని ట్విట్టర్ ద్వారా అందరికీ షేర్ చేశారు.

అయితే ఈ లాక్ డౌన్‌ సమయంలో ఇంటికే పరిమితమైన ప్రజలు తమలో ఉన్న టాలెంట్‌ను బయటకు తీస్తున్నారు. ప్రముఖ తారలంతా తమలో ఉన్న కళా నైపుణ్యాల్ని ప్రదర్శిస్తున్నారు. కొందరు వంట చేస్తుంటే.. మరికొందరు ఇంటి పనులు చేస్తున్నారు. ఇంకొందరైతే అంట్లు తోమడం, ఇల్లు ఊడవడం, పెరటికి నీళ్లు పెట్టడం వంటివి చేస్తున్నారు. మరికొంతమంది సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు.

అందులో భాగంగా టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఓ బొమ్మ గీశారు. అయితే ఆయన గీసిన చిత్రం మామూలు వ్యక్తిది కాదు. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన హాస్య బ్రహ్మం… తనలోని చిత్రకారుడిని నిద్రలేపారు. ప్రముఖ రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) చిత్రాన్ని పెన్సిల్ తో గీసేశారు.

ఆ చిత్రాన్ని బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతమ్.. తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. కాగా ప్రస్తుతం బ్రహ్మానందం కృష్ణ‌వంశీ చేస్తున్న ‘రంగ‌మార్తాండ‌’ సినిమాలో కీల‌క పాత్ర‌ పోషిస్తున్న విషయం తెలిసిందే.