జీవాతో ఆడుకున్న కోహ్లీ

virat-kohli-played-with-dhoni-daughter-ziva

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ధోనీ కూతురు జీవా క‌లిసి సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తున్నారు. శ‌నివారం ఆస్ట్రేలియాపై రాంచీలో జ‌రిగిన టీ20లో విజ‌యం సాధించిన త‌ర్వాత టీమిండియా ఆట‌గాళ్లంతా ధోనీ ఇంటికి విందుకు వెళ్లారు. వారంతా జీవాతో స‌ర‌దాగా ఆడుకున్నారు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ … మీ ఇంట్లో ఎన్ని కుక్క‌లు ఉన్నాయి అని ప్ర‌శ్నించాడు. ప‌క్క‌నే ఉన్న ధోనీ ఆరు ఉన్నాయి అని చెప్పు అని జీవాతో అన్నాడు. ఆరు ఎక్క‌డ ఉన్నాయి అని జీవాకు కోహ్లీ ఇంకో ప్ర‌శ్న వేశాడు. త‌ర్వాత జీవాను ఆట‌ప‌ట్టించేందుకు కోహ్లీ మ్యావ్ మ్యావ్ అని పిల్లిలా అరిచాడు.

మ్యావ్ అని ఎవ‌ర‌న్నారు అని జీవా ప‌దే ప‌దే ప్ర‌శ్నించింది. త‌ర్వాత జీవా, కోహ్లీ ఒక‌రితో ఒక‌రు మ్యావ్, మ్యావ్ అనుకోవ‌డం న‌వ్వు తెప్పించింది. ఇలా జీవాతో స‌ర‌దాగా ఆడుకున్న వీడియ‌ను కోహ్లీ అభిమానుల‌తో పంచుకున్నాడు. జీవాను క‌లిశామ‌ని, స్వ‌చ్ఛ‌మైన అమాయ‌క‌త్వంతో ఇలా స‌ర‌దాగా గ‌డ‌ప‌డం చాలా బాగుంద‌ని కోహ్లీ కామెంట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.