అభినందన్ వీడియో బయటకు రాకపోయి ఉంటే…బతికి వచ్చేవాడా ?

What Happens If Abhinandan Video Not Aired

భారత వైమానిక దళానికి చెందిన పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ గాయపడిన వీడియోలు గడిచిన నాలుగు రోజులుపాటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే పాకిస్థాన్‌ లో ఒక మూక ఆయన్ని కొట్టిన వీడియోలు చూసి ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోయింది. అభినందన్‌ను తీవ్రంగా గాయపరిచిన వీడియోలను ప్రపంచానికి ఎలా చూపిస్తారంటూ భారత విదేశాంగ శాఖ పాకిస్థాన్ హై కమిషనర్‌ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ వీడియోలు బయటికి రావడమే మంచిదైందని లేకపోతే జీవితాంతం ఆయన పాక్ జైల్లో యుద్ద ఖైదీలాగా బతికి చనిపోఏవాడని ఐఏఎఫ్ మాజీ అధికారి, రిటైర్డ్ ఎయిర్ కమోడోర్ జేఎల్ భార్గవ అంటున్నారు . 1971 ఇండో-పాకిస్థాన్ యుద్ధ సమయంలో జేఎల్ భార్గవ పాకిస్థాన్ ఆర్మీకి యుద్ధ ఖైదీగా చిక్కి దాదాపు ఏడాది పాటు బందీగా ఉండి ఆ తర్వాత విడుదలయ్యారు.

అభినందన్ విడుదలపై ఆయన స్పందించారు. పారాచ్యూట్ సహాయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో దిగిన అభినందన్‌ను కొట్టిన అల్లరి మూలకలు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మంచి పనే చేశారని అల చేయకుంటే గనక అభినందన్ పరిస్థితి వేరేలా ఉండేదని, ఆయన బతికి ఉన్నాడనేందుకు ఆధారాలు కూడా దొరకేవికావని అల్లరి మూక వీడియో తీయడమే అభినందన్‌ ను కాపాడిందని అన్నారు. ఒకవేళ అల్లరిమూక ఆ వీడియోను సర్క్యులేట్ చేయకపోయి ఉంటే, అభినందన్ బతికే ఉన్నాడని నిర్ధారించడం చాలా కష్టతరమయ్యేదని ఇస్లామాబాద్ కూడా ఆయన అరెస్టు కాలేదని, అసలు దొరకలేదనే చెప్పేదని ఆయన మిగిలిన జీవితమంతా పాకిస్థాన్ జైలులోనే ముగుసుండేదని 1971 యుద్ధంలో అదృశ్యమైన 54 మంది సైనికుల మాదిరిగానే అభినందన్ కూడా కనిపించకుండా పోయేవారని భార్గవ చెప్పుకొచ్చారు వీడియోలన్నీ సోషల్ మీడియాలో రావడంతోనే పాకిస్థాన్ అభినందన్ అరెస్టును ప్రకటించిందని, అధికారిక వీడియోను విడుదల చేసిందని భార్గవ అన్నారు. అప్పట్లో తన అరెస్టును నెల రోజుల తరవాత భారత్‌ కు పాకిస్థాన్ చెప్పిందని అది కూడా అంతర్జాతీయ ఏజెన్సీలు జోక్యం చేసుకోవడంతో జరిగిందని వెల్లడించారు.

ఒక పైలట్ పారాచ్యూట్ ద్వారా సరిహద్దులో పడినప్పుడు అతనికి ఎదురయ్యే తొలి ప్రమాదం అల్లరిమూకేనని, అభినందన్‌ను పాకిస్థాన్ ఆర్మీ కాపాడటం నిజంగా అదృష్టమని భార్గవ చెప్పారు. దానికి ఉదాహరణగా ఆయన ఒక సంఘటన గురించి వెల్లడించారు. నా సహచర పైలట్ ఫ్లైట్ లెఫ్ట్‌నెంట్ హుస్సేన్ 1965 యుద్ధ సమయంలో పంజాబ్‌ లో పనిచేశాడని అతని విమానం భారత భూభాగంలో కూలిపోయింది. అక్కడి అల్లరిమూక హుస్సేన్‌ ను పాకిస్థానీ అనుకొని తీవ్రంగా కొట్టారని దీంతో ఆయన ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయాడని అయితే ఆ తర్వాత కొట్టినవాళ్లే జలంధర్ కంటోన్మెంట్‌కు వచ్చి ఆయన కోసం దీంతోరక్తదానం చేశారని భార్గవ వివరించారు. అయిది 1971 యుద్ధంలో తన విమానం కూలిపోయి పాకిస్థాన్‌లో పడినప్పుడు తనను తాను 12 గంటలపాటు కాపాడుకోగలిగానని భార్గవ వెల్లడించారు. అప్పటికి తాను ఫ్లైట్ లెఫ్ట్‌నెంట్ హోదాలో ఉన్నానని, 1971 డిసెంబర్ 5న బార్మర్ నుంచి హెచ్ఎఫ్-24 9లో టేకాఫ్ అయ్యానని చెప్పారు. అయితే శత్రు భూభాగంలో తన విమానం కూలిపోయిందని తెలిపారు. ఉదయం 9 గంటలకు నేను విమానంలో నుంచి బయటపడి పాకిస్థాన్‌ లోని ఎడారి ప్రాంతంలో పడడంతో అక్కడి నుంచి నడవడం మొదలుపెట్టాను. 12 గంటలు నడిచి ఓ గ్రామానికి వెళ్లానని అన్నారు.

అయితే నిజానికి యుద్ధంలో పాల్గొనే పైలట్‌ కు మ్యాప్, పిస్తోల్ తదితరాలతో కూడిన సర్వైవల్ ప్యాక్, కొంత పాకిస్థాన్ కరెన్సీ ముందుగానే ఇస్తారని తను సర్వైవల్ ప్యాక్‌ను తీసుకొని, జి-ష్యూట్‌ను తీసేసి ఇసుకలో పూడ్చేశానని ఆ తర్వాత ఊరిలో నా పేరు మన్సూర్ అలీ అని, పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన పైలట్‌ నని అందరికీ చెప్పానని వారిని నమ్మించడానికి నా వద్ద ఉన్న పాకిస్థానీ కరెన్సీ చూపించాననీ అందరూ నమ్మినా అక్కడి స్కూల్ హెడ్ మాస్టర్ నా మాటలు నమ్మలేదని ఏ ఊరు అని అడిదిత రావల్పిండి అని చెప్పానని రావల్పిండిలో ఎక్కడ అన్నాడు. మాల్ రోడ్ అని చెప్పాను. దీంతో అతను మీరు భారత్‌లోని ఓ గ్రామంలో ఉన్నారని అన్నాడని అన్నారు. అయితే ఆయనతో వెంటనే దయచేసి నన్ను పాకిస్థాన్ పంపేయండి అన్నానని నేను పాకిస్థానీని అవునా కాదా అని పరీక్షించడానికే ఆయన అలా అడిగాడని నాకు అర్థమైందని అన్నారు. కొంత సేపటికి నా వద్దకు పాకిస్థాన్ రేంజర్స్ వచ్చారు. ఖలీమా చదవమని నన్ను అడిగారని నా వల్ల కాక దొరికిపోయానని భార్గవ వివరించారు. ప్రస్తుతం భార్గవ వయసు 77 ఏళ్లు. హర్యానాలోని పంచకులలో స్థిరపడ్డారు.