బాబు మోసం చేశారంటున్న మోహన్ బాబు !

Mohan Babu Comments On AP CM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు సినీ నటుడు మోహన్‌బాబు. చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టు కోలేకపోయారని, విద్యాభివృద్ధి అంశంలో ఏపీ సర్కారుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈరోజు తిరుపతి మాట్లాడిన ఆయన తాను నిర్వహిస్తున్న విద్యానికేతన్ విద్యార్థులకు 2014-15 నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న ఈ ఘన కార్యం వలన విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మాట నిలబెట్టుకోని చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రమంతా తిరుగుతూ అమలు కాని హామీలు ఎందుకిస్తున్నారని మోహన్‌బాబు విమర్శించారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటడంతో పార్టీ ముద్ర వేసే అవకాశముందని, తాను ఏ పార్టీలోనూ లేనని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు వెనుక ఏ రాజకీయ పార్టీ ప్రోద్బలం లేదని చెప్పారు. అయితే మొహ్హన్ బాబు కొడుక్కి వైఎస్ జగన్ సోదరికి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన గతంలో వైసీపీ నుండి పోటీకి దిగుతారని కూడా వార్తలు వచ్చాయి. మరి మోహన్‌బాబు వ్యాఖ్యలపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.