భర్తను హత్య చేసిన భార్య

భర్తను హత్య చేసిన భార్య

ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిందో మహిళ. శవాన్ని కాల్చి.. బూడిదను చెరువు లో కలిపి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు యత్నించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండలో జరిగింది. సీఐ తిరుమల్‌ కథనం ప్రకారం.. మండలంలోని గొల్లపల్లి శివారు గేటుపల్లికి చెందిన బాదావత్‌ ధర్యావత్‌ సింగ్‌ (42), జ్యోతి దంప తులకు ఇద్దరు సంతానం.

సింగ్‌ హన్మకొండ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తుండగా.. జ్యోతి స్థానికంగా టైలరింగ్‌ శిక్షణ ఇస్తోంది. ఈ క్రమంలో మండలంలోని అప్పల్‌రావుపేటకు చెందిన సాంబరాజుతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లకు ఈ విషయం భర్త సింగ్‌కు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. ఆగస్టు 21 నుంచి ధర్యావత్‌ సింగ్‌ ఇంట్లోనే ఉంటుండటంతో జ్యోతికి సాంబరాజును కలవడం సాధ్యం కావడం లేదు. ఎప్పటికైనా ఈ సమస్య ఎదురవుతుందని భావించిన ఆమె.. భర్తను హత్య చేయాలని నిర్ణయించింది. ప్రియుడితో కలసి పథకం పన్నింది.