బలుపు చూపి చిక్కుల్లో పడింది

woman complaint against anasuya

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

హాట్‌ బ్యూటీ అనసూయపై పోలీసు కేసు నమోదు అయ్యింది. ఆమె కాస్త అత్యుత్సాహం చూపించడంతో ఫీల్‌ అయిన ఒక మహిళ అభిమాని ఓయూ పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టడం జరిగింది. బాధితురాలు ఇచ్చిన కేసు బుక్‌ చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే… యాంకర్‌ అనసూయ తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు తార్నాకకు వెళ్లడం జరిగింది. ఆ సమయంలోనే అనసూయతో సెల్ఫీ తీసుకునేందుకు ఒక కుర్రాడు ఆసక్తి చూపించాడు. ఆమెను అడగకుండా సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. దాంతో కోపం తెచ్చుకున్న అనసూయ ఆ కుర్రాడి నుండి మొబైల్‌ లాక్కుని బద్దలు కొట్టింది. ఆమె బలంగా రోడ్డుపై ఫోన్‌ను ఎత్తి వేయడంతో పగిలి పోయింది.

ఆ సమయంలో ఆ కుర్రాడి తల్లి కూడా అక్కడే ఉంది. అనసూయను ఎందుకు ఇలా చేశారు అంటూ ప్రశ్నిస్తుండగానే అనసూయ వారిని తీవ్ర పదాలతో దూషించడం మొదలు పెట్టిందట. ఫోన్‌ పగుల కొట్టినందుకు కనీసం పశ్చాతాపం కూడా చూపించకుండా ఆగ్రహంతో అక్కడ నుండి వెళ్లి పోయిందని, వెళ్లి పోయే సమయంలో తనపై తీవ్ర పదజాలంతో మాటలను వదిలింది అంటూ సదరు మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. సెల్ఫీ ఇష్టం లేకుంటే సున్నితంగా చెప్పాలని, అలా కాకుండా ఫోన్‌ను బద్దలు కొట్టి, తిట్టి వెళ్లి పోయింది అంటూ ఆ మహిళ మీడియా ముందు చెప్పుకొచ్చింది. ఈ విషయమై అనసూయ ఇంకా స్పందించాల్సి ఉంది.