నేటితో ముగియనున్న వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర

YCP Social Empowerment Bus Yatra will end today
YCP Social Empowerment Bus Yatra will end today

వైసీపీ మొదటి దశ సామాజిక సాధికార బస్సు యాత్ర ముగియనుంది. నేటితో ముగియనున్న వైసీపీ మొదటి దశ సామాజిక సాధికార బస్సు యాత్ర. సామాజిక సాధికార యాత్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలతో ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. గత నెల 26న ప్రారంభమైన బస్సు యాత్ర.. ఇవాళ ముగియనుంది. ఈ బస్సు యాత్ర దాదాపు 39 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసింది.

రెండో దశ బస్సు యాత్ర ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు ప్రారంభం అవుతుంది. ఇక 15 రోజుల్లో 40 అసెంబ్లీ నియోజకవర్గాలను సామాజిక సాధికార బస్సు యాత్ర కవర్ చేయనుంది. ఇది ఇలా ఉండగా.. పార్టీ కార్యక్రమాలపై సజ్జల రామకృష్ణా రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఓటర్ల జాబితా నియోజకవర్గ ఇంఛార్జులతో సజ్జల టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వై ఏపీ నీడ్స్ జగన్ క్యాంపైన్, నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలో అవకతవకల పై నేతలకు దిశా నిర్దేశం చేశారు సజ్జల..నిన్నటి నుంచి ప్రారంభం అయిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై కీలక ఆదేశాలు జారీ చేశారు.