యువకుడి దారుణ హత్య

యువకుడి దారుణ హత్య

ఓ తల్లి, ఇద్దరు కుమారులు ఇల్లు అద్దెకు తీసుకున్నారు. మూడు రోజులు కిందటే ఇంట్లోకి వచ్చారు. తల్లి పని మీద ఊరెళ్లడంతో ఇంట్లోనే ఉన్న కొడుకు తెల్లారేసరికి విగతజీవిగా కనిపించాడు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని చూసిన ఇంటి ఓనర్, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి వేళ మందు పార్టీ చేసుకున్న స్నేహితుల మధ్య గొడవ జరగడంతో హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ దారుణ ఘటన అల్వాల్‌లో జరిగింది.

అల్వాల్ ఖానాజీగూడ ఏరియా తిరుమల నగర్‌లో మూడు రోజుల కిందట ఓ కుటుంబం అద్దెకు వచ్చింది. తల్లి, ఇద్దరు కుమారులు వచ్చి ఇల్లు అద్దెకు తీసుకున్నారు. తల్లి ఊరెళ్లడంతో కొడుకు బాలిక్రిష్ణ ఫ్రెండ్స్‌తో మందుపార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరుసటి రోజు ఉదయానికి బాలక్రిష్ణ మెడపై బలమైన గాయంతో రక్తపు మడుగులో శవమై కనిపించాడు. గమనించిన ఇంటి ఓనర్ రవి, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

తల్లి ఊరెళ్లడంతో స్నేహితులతో మందు పార్టీ చేసుకున్నాడని భావిస్తున్నారు. మద్యం మత్తులో స్నేహితుల మధ్య గొడవ జరిగి హత్య చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలంలో ఇంట్లోని వస్తువులు మద్యం బాటిళ్లు చిందరవందరగా పడి ఉన్నాయి. తాగిన మైకంలో ఘర్షణ జరగడంతో స్నేహితులు విచక్షణా రహితంగా కొట్టుకుని బాలక్రిష్ణని హతమార్చి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.