అన్నతో రాసలీలలు.. అడ్డు వస్తుందన్న కోపంతో సొంత అక్కనే దారుణంగా చంపేసింది

తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమకు అడ్డు వస్తుందన్న కోపంతో ఓ మైనర్ బాలిక సొంత అక్కనే దారుణంగా చంపేసింది. అయితే అన్న వరుసయ్యే యువకుడితో ప్రేమను అడ్డుకుంటుందన్న కోపంతోనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
అయితే అన్న వరుసయ్యే యువకుడితో ప్రేమలో పడిన ఓ బాలిక దారుణానికి పాల్పడింది. తన ప్రేమను అడ్డుకుంటుందన్న పగతో తోడబుట్టిన అక్కనే ఏకంగా ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా చంపేసింది. ఈ ఘోరమైన ఘటన తమిళనాడులోని నామక్కల్ పట్టణ పరిధిలో జరిగింది.

కోసవంపట్టి దేవేంద్రపురానికి చెందిన శంకరన్‌‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె మోనిషా(18) నామక్కల్‌లో ఇంజినీరింగ్‌ రెండవ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 4న ఇంట్లో తల్లిదండ్రులు బయటకు వెళ్లడంతో మోనిషా ఒంటరిగా ఉంది. వారు ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె ఎడమచేతి మణికట్టు కోసుకున్న స్థితిలో తీవ్ర రక్తస్రావంతో కనిపించింది. దీంతో తల్లిదండ్రులు మోనిషాను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై విషయం తెలుసుకున్న పోలీసులు తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించి ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు.

అదేవిధంగా తమ కూతురిని ఆత్మహత్య చేసుకునేంత కష్టాలు లేవని, ప్రేమ వ్యవహారం కూడా లేదని చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో మోనిషా మృతదేహాన్ని మార్చురీకి తరలించి పోస్టుమార్టం చేయించారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆమెను గొంతు నులిమి చంపేశారని.. ఆ తర్వాత ఎడమ చేతిని కత్తితో కోశారని వెల్లడైంది.

దీంతో దీన్ని హత్యకేసుగా మార్చిన పోలీసులు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులందరినీ ప్రశ్నించారు. విచారణలో మోనిషా చెల్లెలు(17) తడబడుతూ.. సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఆమె వ్యవహారశైలిపై పోలీసులు లోతుగా విచారించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది.  మోనిషా చెల్లెలు రాహుల్(19) అనే బంధువుల అబ్బాయిని ప్రేమించింది. అతడు అన్న వరుస కావడంతో కుటుంబసభ్యులు వారి ప్రేమను నిరాకరించారు.

మోనిషా కూడా చెల్లెలి ప్రేమను తిరస్కరించింది. ఈ వ్యవహారంతో కొద్దిరోజులుగా వారి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. అక్క కారణంగానే తన ప్రేమను తల్లిదండ్రులు తిరస్కరించారని మోనిషా చెల్లెలు కక్ష పెంచుకుంది. ఈ నెల 4వ తేదీన మోనిషా ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ప్రియుడిని రప్పించి గొంతు నులిమి దారుణంగా హత్య చేయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు.