వైరల్ అవుతున్న జగన్ బంగీ జంప్ !

YS Jagan Mohan Reddy Bungee Jump at Kawarau Bridge

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర ఈ రోజుతో 200 రోజులకు చేరింది. పాదయాత్ర సందర్భంగా పలుమార్లు జగన్ ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని ఆయన పాదయాత్రను కొనసాగించారు. వణికే చలితో మొదలెట్టి.. మండే ఎండను లెక్క చేయకుండా ఇప్పుడు వర్షంలోనూ జగన్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. తాను న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లడానికి జగన్ అనుమతి కోరారు అయితే అలా వెళ్ళడానికి వీలు లేదని ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ అప్పట్లో సీబీఐ కోరింది. కానీ కోర్టు మాత్రం జగన్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఆ క్రమంలో న్యూజిలాండ్‌ పర్యటనకు సతీసమేతంగా జగన్‌ వెళ్లారు. ఆ సందర్భంగా జగన్ ఈ సాహసం చేశారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కవారా బ్రిడ్జ్ పై నుంచి ఆయన బంగీ జంప్ చేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఈ బంగీ జంప్‌ను జగన్‌ అలవోకగా చేసినట్టు ఈ ఫొటోల ద్వారా తెలుస్తోంది.