భాను ఈజ్‌ బ్యాక్‌.. చాలా మార్పు

Udaya Bhanu Re Entry with Nakshatram Audio Launch

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Udaya Bhanu Re-Entry with Nakshatram Audio Launch

దాదాపు 20 సంవత్సరాల నుండే బుల్లి తెరపై యాంకర్‌ అంటే ఉదయ భాను అని తెలుగు ప్రేక్షకులు ఫిక్స్‌ అయ్యారు. దాదాపు 15 సంవత్సరాల పాటు బుల్లి తెరపై తన సత్తా ఏంటో చాటింది. ప్రతి తెలుగు ఇంట్లో కూడా ఉదయ భాను సుపరిచితురాలు అయ్యి ఉండేది. అయితే కాల క్రమేనా ఆమె క్రేజ్‌ తగ్గింది. ఇతర యాంకర్లు రావడంతో ఆమెకు మెల్ల మెల్లగా అవకాశాలు రావడం ప్రారంభం అయ్యింది. ఆమె చేసిన షోలు కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. దాంతో చిన్న చిన్నగా బుల్లి తెరకు దూరం అయ్యింది. ఈ సమయంలోనే ఆమె గర్బవతి అవ్వడంతో పాటు కవల పిల్లలకు జన్మనివ్వడం జరిగింది.

పిల్లలు పుట్టిన తర్వాత మళ్లీ ఉదయభాను యాంకర్‌గా రీ ఎంట్రీ ఇస్తుంది. తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నక్షత్రం’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంకు ఉదయభాను యాంకర్‌గా వ్యవహరించింది. గతంలో అల్లరి చిల్లరిగా మాట్లాడుతూ కార్యక్రమంను నడిపించే భాను ఇప్పుడు మాత్రం కాస్త హుందాగా నడిపించడం కనిపించింది. మునుపటితో పోల్చితే ఏమాత్రం గ్లామర్‌ తగ్గలేదు. అదే అందం మరియు అదే ఫిజిక్‌తో ఉదయభాను ఆకట్టుకుంటుంది. రీ ఎంట్రీతో మళ్లీ ఈమె సుమ వంటి స్టార్‌ యాంకర్‌కు పోటీ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. బుల్లి తెరపై రియాల్టీ షోల్లో కూడా త్వరలో భాను కనిపించే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు:

‘డీజే’ వృదా ప్రయత్నం.. మరింత నష్టం