అమ్మో బంగారమా! అనిపిస్తున్న పసిడి ధరలు…ఇంకా భారీగా పెరిగే అవకాశాలు….

భారీగా పెరిగిన బంగారం ధర

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పసిడి ధర పరుగులు పెడుతోంది. సామాన్యుడికి అందనంత దూరంలో.. బంగారం ధరలు కొండెక్కాయి. ఏడాదిలో దాదాపు 50 శాతం పెరిగాయి. అమెరికా, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా, జపాన్‌ దేశాల బలహీన ఎకానమిక్‌ డేటా ఇవన్నీ కలిసి పసిడి ధరను భారీగా పెంచేశాయి. అందుకు తోడు కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా అన్ని ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు అంతగా ఆసక్తిని చూపించడం లేదు.  దీంతో పసిడి ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. 10 గ్రాముల బంగారం రూ. 50 వేలకు చేరుకుంటుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా బులియన్‌ ట్రేడింగ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,865కు చేరుకుంది. ఇక వెండి కూడా అదే దారిలో పయనిస్తోంది. కిలో వెండి ధర మూడు శాతం పెరిగి.. రూ.48,208ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  కాగా హైదరాబాద్‌ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,408కి చేరుకుంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,510గా నమోదైంది. అంటే దీన్నిబట్టి బంగారం ధరలు రూ. 50 వేలకు చేరువలో ఉన్నట్లు స్పష్టమౌతుంది.