ఎగ్జామ్స్ షురూ: జూన్ 20 నుంచి బీటెక్ ఎగ్జామ్స్.. నియమానుసారంగా..

కరోనా వైరస్ తో విధించిన లాక్‌డౌన్‌ కు కాస్త సడలింపులు లభించాయి. దీంతో విద్యాసంస్థలు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. తాజాగా జేఎన్టీయూహెచ్‌ స్టూడెంట్స్ కు పరీక్షలు జరిపేందుకు రెడీ అయింది. కరోనా కారణంగా నిలిచిపోయిన డిగ్రీ, బీటెక్‌ పరీక్షలను జూన్‌, జూలై మాసాలలో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

అందులో భాగంగా జూన్‌ 20 నుంచి 30వ తేదీవరకు బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు నిర్వహించడానికి షెడ్యూల్‌ ఇవ్వనుంది. అలాగే.. జూలై 16 నుంచి బీటెక్‌ ఫస్టియర్‌, సెకండియర్‌, థర్డ్‌ఇయర్‌ పరీక్షలు కూడా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూనే సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నట్లు ఆ వర్సిటీ ఇంచార్జి రిజిస్ట్ట్రార్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలకు అఫిలియేషన్‌ ప్రక్రియలో భౌతిక తనిఖీలు రద్దు చేసే ఆలోచనతో వర్సిటీ ఉంది. కాగా ఈసారి తనిఖీలు లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరించిన దరఖాస్తులు, కాలేజీ యాజమాన్యాలు ఇచ్చే అఫిడవిట్లతో 2020-21 విద్యా సంవత్సరానికి అఫిలియేషన్ల మంజూరుపై మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం అందుతుంది.