కామం.. అక్కా.. తమ్ముడి… బంధాన్ని కాల్చేసింది

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఘోరం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామంధుడు వావి వరుసలు మర్చిపోయి దారుణానికి పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని నాగలూటి చెంచుగూడంలో ఈ దారుణం చోటుచేసుకుంది. తన భర్త అనారోగ్యం పాలుకావడంతో కొద్దిరోజులుగా స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తుంది. తాజాగా ఆయన పరిస్థితి మరింత విషమించడంతో బయటకు వచ్చి ఆమె ఆటోకోసం వేచి చూస్తుంది. అదే సమయంలో ఎంతో కాలంగా ఆమెకోసం వేచి చూస్తున్న ఓ యువకుడు మంచి అదునుగా భావిచి ఆటో చూపిస్తానని దూరంగా ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఆమె షాక్ కు గురైంది. వరుసకు అతడు తమ్ముడు అవుతాడు. అయినా కానీ.. కామంతో అతడి చేష్టలకు ఆమె అవాక్కయింది. ఊర్లో కొంతమందికి విషయం చెప్పినా.. పట్టించుకోకుండా పైగా ఆమెనే అతడి బైక్ ఎక్కి ఎందుకు వెళ్లావు అంటూ తిట్టిపోశారు.

ఆ తర్వాత మరుసటి రోజు భర్తతో పాటు ఆసుపత్రికి వెళ్లిన భార్య పరిస్థితిని గమనించి వైద్యులు ఆమెకూ పరీక్షలు నిర్వహించారు. అప్పుడు బాధితురాలు విషయం బయటకు చెప్పిది. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఆ గూడెం పెద్దలు ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నిందితుడు గతంలో ఓ మహిళపై అత్యాచారం చేసి హత్యచేసిన వ్యక్తి. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న పోలీసుకులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.