దేశంలో మరో 16వేల కరోనా కొత్త కేసులు….

కరోనా నవీకరణలు
కరోనా నవీకరణలు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా 3.32 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే.. 16,135 మందికి పాజిటివ్‌ వచ్చింది. పాజిటివిటీ రేటు 4.85 శాతానికి చేరింది. ఇప్పటివరకూ 4.35 కోట్ల మందికి పైగా కొవిడ్ బారినపడ్డారు. యాక్టివ్ కేసులు 1,13,864కి చేరగా.. నిన్న 13,958 మంది కోలుకున్నారు.

24 గంటల వ్యవధిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తంగా 5.25 లక్షల మందికిపైగా చనిపోయారు. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో వైరస్ ఉద్ధృతి కనిపిస్తోంది. ఇటు కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రాలను కేంద్ర అప్రమత్తం చేసింది. ప్రజలు నిబంధనలు పాటించేలా చూడాలని సూచించారు. మాస్క్, భౌతిక దూరం కచ్చితంగా పాటించేలా చూడాలన్నారు. ఇదిలా ఉంటే WHO కూడా కరోనాపై ఆందోళన వ్యక్తం చేసింది..