నల్లగొండలో ఇద్దరు డిగ్రీ విద్యార్థినిలు పురుగుల మందుతాగి ఆత్మహత్య..!

Two degree students committed suicide by drinking pesticides in Nalgonda..!
Two degree students committed suicide by drinking pesticides in Nalgonda..!

నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ఇద్దరు డిగ్రీ విద్యార్థినులు మృతి మరణించారు. ఈ సంఘటన నిన్న జరుగగా.. ఇవాళ వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… నిన్న నల్లగొండ పట్టణంలోని రామ్ నగర్ పార్క్ లో ఇద్దరు డిగ్రీ విద్యార్థినిలు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

అయితే.. ఇవాళ చికిత్స పొందుతూ శివాని, మనీషా కొద్దిసేపటి క్రితం మృతి చెందారు.గడ్డి మందును అధిక మోతాదులో వెంట తెచ్చుకుని విద్యార్థినిలు తాగి మరణించారు. ఆత్మహత్యకు సిద్ధపడి విద్యార్థినిలు గడ్డి మందు తెచ్చుకుని నిన్న తాగారు. ఇక ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .