కరోనా వైరస్ లాక్ డౌన్ తో జనం అంతా ఎక్కడి వాళ్లు నిలిచిపోయారు. దాదాపు రెండు నెలల నుంచి రవాణా సౌకర్యం లేక కుతకుతలాడిపోతున్నారు ప్రజలు. దీంతో ఒక్కసారిగా లాక్ డౌన్ సడలించడంతో ఇప్పుడు ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా జూన్ 1నుంచి 200 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని ప్రకటించిన రైల్వేశాఖ మరికొన్ని రైళ్లను పట్టాలు ఎక్కించేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం నడుపుతున్న 30 ప్రత్యేక రైళ్ల బుకింగ్ కు సంబంధించి ఇండియన్ రైల్వే కొన్ని మార్పులు చేసింది. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్-ఏఆర్పీను ప్రస్తుతమున్న 7రోజుల నుంచి 30రోజుల వరకు పెంచింది. ఇప్పటికే ఆన్లైన్లో ముందస్తు రిజర్వేషన్ కు ప్రయాణికుల నుంచి భారీ స్పందన వస్తున్న విషయం తెలిసిందే.