హైదరాబాద్‌లో రెండ్రోజులు బస చేయనున్న ప్రధాని మోదీ.. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకునే ఛాన్స్…

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ నగరానికి రానున్న సంగతి తెలిసిందే. ఆయన రెండ్రోజుల పాటు హెచ్ఐసీసీ ప్రాంగణంలోని నోవాటెల్‌ హోటల్‌)లో బస చేయనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జులై 1న, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా 2న హైదరాబాద్‌కు చేరుకుంటారు. హైదరాబాద్‌పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీపాతబస్తీలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.

ఛార్మినార్‌ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారని సమాచారం. ఈ నేపథ్యంలోనే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి మోదీ వస్తున్నారని తమకు సమాచారం అందిందని.. ఆయనకు ఏ లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.