నిందితుల శరీరాల్లో మొత్తం 12 బులెట్లు

నిందితుల శరీరాల్లో మొత్తం 12 బులెట్లు

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని షాద్ నగర్ ప్రాంతంలో జరిగినటువంటిని వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచార, హత్య కేసులో నిందితులైన నలుగురు మృగాలను, దిశ ఘటన జరిగిన ప్రదేశంలోనే పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపేశారు. కాగా ఈ ఘటన కి సంబందించిన కేసులో పోలీసులు కేసు విషయంలో సిన్ రికర్రెక్షన్ చేస్తున్న సమయంలో ఆ నిందితులు పారిపోవాలని ప్రయత్నిస్తూ, పోలీసులపై దాడి చెయ్యడం వల్ల, ఆత్మ రక్షణ నిమిత్తమై పోలీసులు ఆ నిందితులపై కాల్పులు జరిపారు. దీంతో ఆ నిందితులు నలుగురు కూడా ఎన్ కౌంటర్ లో మరణించారు.

అయితే ఈ నిందితుల మృతదేహాలకు కోర్టు ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం వరుకు భద్రపరచాలి అని నిర్ణయించుకున్నారు. కాగా ఈ నేపథ్యంలో ఆ నిందితుల మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్న సమయంలో కొన్ని కీలకమైన షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. కాగా ఎన్ కౌంటర్ సమయంలో జరిపిన కాల్పుల్లో నిందితుల శరీరాల్లో మొత్తం 12 బులెట్లు దిగినట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించారు. కానీ పోస్టుమార్టం చేస్తున్న సమయంలో వారి శరీరాల్లో కనీసం ఒక్క బులెట్ కూడా కనిపించలేదని సమాచారం. అయితే ఆ బులెట్లు నిందితుల శరీరాలను చీల్చుకొని బయటకు వచ్చాయా ? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు…