సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘418’. ఈ సినిమాపై మొదటి నుంచీ ఆసక్తికరమైన అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి ఈ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, చివరి నిమిషంలో సెన్సార్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో విడుదల వాయిదా పడింది.
సినిమాలోని కంటెంట్ కారణంగానే సెన్సార్ ఆలస్యం అయిందనే ప్రచారం కూడా అప్పట్లో వినిపించింది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది.
సెన్సార్ పూర్తవడంతో పాటు ‘418’ Movie కొత్త రిలీజ్ డేట్ను కూడా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రానుంది. దీంతో హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ప్రశాంత్ నీల్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం నెవర్ బిఫోర్ హారర్ థ్రిల్లర్ అనుభూతిని అందించబోతుందనే టాక్ ఇప్పటికే వినిపిస్తోంది. కథ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు సినిమాలోని కంటెంట్ ఎలా ఉండబోతుందనే దానిపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది.
‘418’ చిత్రానికి కీర్తన్ నందగౌడ దర్శకత్వం వహించారు. సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతీ పగడాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మరి సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రాబోతున్న ఈ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో భయపెట్టి, థ్రిల్ చేస్తుందో చూడాలి.







