8ఏళ్ల చిన్నారిపై బాలుడు అత్యాచారం.. ఆపై పరార్..

కరోనా వైరస్ తో ప్రపంచమంతా వణికిపోతుంటే అమ్మాయిలపై అఘాయిత్యాలు ఏమాత్రం ఆగడం లేదు. నిత్యం ఏదో ఓ చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో 8 ఏళ్ల బాలికపై బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడుయ.

కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ ఘోరం జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రతినిత్యం అమ్మాయిలపై ఎక్కడో ఓ చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలో చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటన అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. ఆడుకుందామని చెప్పి బాలికను ఇంటికి తీసుకెళ్లాడు. ఆ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆ పాపను అత్యాచారం చేశాడు. హైదరాబాద్ మెహదీపట్నంలోని భోజగుట్ట ప్రాంతంలోఈ ఘటన చోటు చేసుకుంది. 8 ఏళ్లచిన్నారిని… 14 ఏళ్ల బాలుడుగా తెలుస్తోంది.

కాగా అభం శుభం తెలియని చిన్నారి కావడంతో ఏం జరుగుతుందో తెలియక కేకలు వేసింది. దీంతో ఆ చిన్నారి కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు అక్కడికి చేరుకున్నారు. దాంతో భయపడ్డ బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఆసిఫ్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి తల్లిదండ్రుల్ని కూడా విచారిస్తున్నారు. పరారీలో ఉన్న బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.