తమిళనాడులో నిప్పులాంటి మనిషి

a-government-employee-without-taking-bribe-in-tamil-nadu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

నిప్పులాంటి మనిషి అంటే ఆయన కేరెక్టర్ బాగుంటుందనే అభిప్రాయం ఉంటుంది. సరిగ్గా అలాంటి నిప్పులాంటి మనిషి ఇప్పుడు తమిళనాడులో డ్యూటీ చేస్తోంది. సాధారణంగా ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకోవడం కామన్. కానీ ఆమె మాత్రం లంచం ఇస్తే పోలీసులకు పట్టిస్తుందట. అందుకే ఆమెకు లంచం ఇవ్వాలంటే నేతలు భయపడిపోతున్నారు.

తమిళనాడు పొల్లాచిలో పి.ముత్తుమరి అనే మహిళ వీఏఓగా పనిచేస్తోంది. ఆమెకు లంచం తీసుకోవడం ఇష్టం లేదంట. అవినీతికి వ్యతిరేకంగా కృషి చేస్తున్న సదరు అధికారి.. లంచానికి ఆమడ దూరంలో ఉంటారు. ఉద్యోగంలో చేరిన కొత్తలోనే ఓ వ్యక్తి కొన్ని భూములకు సంబంధించిన పత్రాలపై సంతకాలు పెట్టాలని లంచం ఇస్తే ఆమె సీరియస్ అయింది.

ఇక్కడ లంచం ఇవ్వద్దు అని ఆమె నేమ్ ప్లేట్ పక్కనే బోర్డు పెట్టి మరీ పనిచేసుకుంటున్నారట. సదరు అధికారిణిని చూసి ఉన్నతాధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారట. కోరి డబ్బులు వద్దంటోందని కొందరు జాలి పడుతుంటే.. మరికొందరు మాత్రం ఈరోజుల్లోనూ ఇంత నిజాయితీపరులున్నారని సంతోషపడుతున్నారు.

మరిన్ని వార్తలు:

ప్రియాంకను కోరుకుంటున్న ప్రతిపక్షాలు

జానాకు పీసీసీ కావాలట