పెళ్లి చేసుకోవాలని కోరినందుకు దారుణ హత్య

పెళ్లి చేసుకోవాలని కోరినందుకు దారుణ హత్య

తనను నమ్మి వచ్చిన యువతి పెళ్లి చేసుకోవాలని కోరినందుకు దారుణంగా హత్యచేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి కాల్చి, ఆనవాళ్లు లేకుండా చేశాడు. 2018 జూన్‌లో జరిగిన ఈ దారుణం పోలీసుల విచారణలో తాజాగా వెలుగు చూసింది. మృతురాలి తండ్రి షేక్‌ కరిముల్లా తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు అల్లీనగర్‌కు చెందిన షేక్‌ కరీమ్‌ అలియాస్‌ నాగూర్‌.. కరిముల్లా కుమార్తె నజీమాబేగం(28)ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు.

ఈ క్రమంలో బంధువుల పెళ్లికి వెళ్లి వస్తానని చెప్పి 2018 మే 25న నజీమాబేగం ఇంటి నుంచి వెళ్లింది. ఆ తర్వాత ఆమె ఆచూకీ లభించకపోవడంతో అదే ఏడాది జూన్‌ 21న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారించినా ఆమె ఆచూకీ లభించలేదు. ఈ నెల 4వ తేదీన రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ వర్మను బాలిక బంధువులు కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు నాగూర్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ ఘోరం బయటపడింది.