మళ్లీ మీడియా ముందుకు వచ్చిన నటుడు శివాజీ

మళ్లీ మీడియా ముందుకు వచ్చిన నటుడు శివాజీ

ప్రముఖ నటుడు శివాజీ కొన్ని రోజుల తరువాత మళ్లీ మీడియా ముందుకు వచ్చాడు. గతంలో కొన్ని కారణాల వలన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి నటుడు చివాజి మళ్ళీ మీడియా ముందుకొచ్చి కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ… తనకు ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతగానో ఇష్టమని, చిరంజీవి ని ఒక దైవం రూపకంగా ఆరాదిస్తానని చెప్పిన శివాజీ, ఇప్పటి తరం హీరోల్లో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని వెల్లడించారు.

అంతేకాకుండా దక్షణాది ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత అంతటి స్థాయిని అందుకునే సత్తా ఉన్న ఏకైక హీరో ఒక్క అల్లు అర్జున్ ఒక్కడే అని శివాజీ అన్నారు.ఇకపోతే అల్లు అర్జున్ నటించినటువంటి “సరైనోడు” సినిమాలో అల్లు అర్జున్ చేసినటువంటి క్యారెక్టర్ చాలా ఇష్టమని, ఇప్పటికే చాలా సార్లు సరైనోడు సినిమా చూశానని, అల్లు అర్జున్ సినిమా కోసం పడే కష్టం చూస్తే ఆశ్చర్యం వేస్తుందని వాఖ్యానించిన శివాజీ, తానే గనక అల్లు అరవింద్ కొడుకు అయ్యుంటే మాత్రం ఇంతలా కష్టపడేవాడ్ని కాదని వాఖ్యానించారు.