ప్రముఖ నటి మృతి….విషాదంలో చిత్ర సీమ !

sujatha kumar passes away

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. పలు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించిన నటి సుజాతా కుమార్ కన్ను మూశారు. కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతూ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుజతా కుమార్ ఆదివారం రోజు రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె సోదరి, బాలీవుడ్ సింగర్ సుచిత్రా కృష్ణమూర్తి ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ధృవీకరించారు. అతిలోకసుందరి సెకండ్ ఇన్నింగ్స్ కి రీఎంట్రీ ఇస్తూ చేసిన ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాలో శ్రీదేవి అక్కగా నటించింది సుజతా కుమార్. ధనుష్ హీరోగా చేసిన బాలీవుడ్ సినిమా ‘రంజానా’తో పాటు ‘క్యా లవ్‌స్టోరీ హై’ వంటి పలు చిత్రాల్లో నటించారు సుజతా కుమార్. అంతే కాక తెలుగులో సూపర్ హిట్ అయిన బాలయ్య చట్రం లెజెండ్ లో ఆయనకు బామ్మగా కూడా నటించారు.

actor-sujatha-kumar-passes-away

2007లోనే బ్రెస్ట్ క్యాన్సర్‌కి గురైన సుజతా కుమార్, దాని నుంచి పోరాడి బయటపడ్డారు. అయితే కొన్నాళ్ల క్రితం సుజతా కుమార్‌కు మెటాస్టాటిక్ క్యాన్సర్ ఎటాక్ అయింది, అయితే అది ఉందని తెలిసే లోపే నాలుగో స్టేజీలో ఉన్నట్టు తేలింది. దీని కారణంగా కొన్ని అవయవాలు కూడా పనిచేయడం మానేశాయి. రెండు రోజుల క్రితం సుజతా కుమార్‌ను ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చినట్టు, తర్వాత ‘నిన్న రాత్రి 11.26 ని.లకు సుజతా కుమార్ కన్ను మూసారని ఆమె ఆత్మకు శాంతి జరగాలని కోరుకుందామని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది సుచిత్రా కృష్ణమూర్తి.

actor-sujatha-kumar

సుజతా కుమార్ అంతిమ యాత్ర ఈరోజు ఉదయం 11 గంటలకు విల్లే పార్లే వెస్ట్ ప్రాంతంలోని జూహూ శశ్మానవాటికలో జరగనున్నట్టు మరో పోస్ట్‌లో తెలిపింది సుచిత్ర.అయితే ఆమె మృతి గురించి తెల్సుకున్న ప్రముఖులు తమ తమ సంతాపాన్ని తెలియ చేస్తున్నారు. ఆమె అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ తో ప్రత్యేక అనుబంధం ఏర్పరచుకోవడంతో చిత్ర సీమలో విషాదం నెలకొంది.

Sujata Kumar