ఆ తర్వాత బాలకృష్ణను చూసి భయమేసింది: రాశీ

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాశి తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఆ సందర్బంగా నందమూరి బాలకృష్ణ ప్రస్తావన తీసుకొచ్చారు. అప్పట్లో బాలకృష్ణతో సినిమా చేస్తున్న సమయంలో తాను భయపడిపోయిన సందర్బాన్ని గుర్తు చేసుకున్నారు.

అదెలాగంటే.. తెలుగుతెరపై స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది రాశి. చెన్నైలో జన్మించిన ఈ అందాల రాశి బాలనటిగానే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్‌గా కూడా స్టార్ హీరోల సరసన నటించింది. సుమారు 30కి పైగా సినిమాల్లో ఫుల్ లెంగ్త్ హీరోయిన్‌గా నటించారు. పలు స్పెషల్ సాంగ్స్ చేసి ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. పెళ్లి చేసుకొని కొంతకాలంగా సినిమాలకు దూరమై తిరిగి ఇప్పుడు కెమెరావైపు చూస్తోంది. ఈ క్రమంలో తాజాగా నటసింహం బాలకృష్ణపై ఆసక్తకర కామెంట్స్ చేశారు.

ఆమె ఏమన్నారంటే.. బాలకృష్ణతో బాలనటిగా.. ఆయన సరసన హీరోయిన్‌గా నటించిన అనుభవం రాశికి ఉంది. తాను బాలనటిగా బాలకృష్ణతో ‘బాలగోపాలం’ సినిమా విశేషాలను తెలుపే సమయంలో హీరోయిన్ ఛాన్స్ వచ్చాక ఏం జరిగింది? బాలయ్య బాబు ఎలా రియాక్ట్ అయ్యారనే విషయాలను రాశి మీడియాతో పంచుకుంది.

అదేవిధంగా బాలగోపాలం సినిమాలో తనతో పాటు నందమూరి కల్యాణ్ రామ్ కూడా నటించారని.. అయితే ఆ తర్వాత బాలయ్య బాబుతో మళ్లీ ‘కృష్ణబాబు’ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ రావడంతో ఓకే చెప్పాను గానీ.. ఈ సినిమా షూటింగ్ సమయంలో చాలా భయమేసిందని రాశి తెలిపింది. బాలయ్య తనను ఎలా యాక్సప్ట్ చేస్తారో అని భావించాను గానీ.. అలా ఏం జరగలేదని తెలిపింది. అలాగే.. ‘బాలగోపాలం’ సినిమా చేసేటపుడు చిన్నగా ఉన్నాను. కాబట్టి పర్వాలేదు.

కానీ అదే బాలకృష్ణతో ‘కృష్ణబాబు’ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతున్నాను. ఇదే తనలో భయానికి కారణమైంది’ అని రాశి వివరించింది. ఆ భయంతోనే కారు దిగి సెట్‌కు వెళ్తుండగా అక్కడ బాలయ్య కూర్చొని ఉన్నారని.. తాను విష్ చేసే లోపే ఎలా ఉన్నావ్.. ఇలారా అంటూ ఆయన పలకరించడంతో భయపడిపోయాను.. వెంటనే కూల్ అయ్యానని తెలుపుతూ గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది రాశి. అంతేకాకుండా బాలయ్య చాలా నైస్ పర్సన్ అని రాశీ చెప్పడం విశేషం. కాగా ప్రస్తుతం రాసీ వెబ్ సిరీస్ చేస్తుంది.