ఐశ్యర్య రాయ్ కి కూతురు ఆరాధ్యకి కూడా కరోనా పాజిటివ్

ఐశ్యర్య రాయ్ కి కూతురు ఆరాధ్యకి కూడా కరోనా పాజిటివ్

కరోనా వైరస్ మహమ్మారి బాలీవుడ్ తారలు వదలడం లేదు. నిన్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలగా, కొద్దీ సేపటికే అభిషేక్ బచ్చన్ కి సైతం కరోనా వైరస్ పాజిటివ్ అని వార్త రావడం సంచలనం గా మారింది. అయితే తాజాగా అభిషేక్ బచ్చన్ భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్యర్య రాయ్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. కూతురు ఆరాధ్య బచ్చన్ కి కూడా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. వరుసగా రెండు సార్లు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరపగా పాజిటివ్ అని తేలడం గమనార్హం. అంతేకాక మరో పక్క బాలీవుడ్ పెద్దలను సైతం ఈ కరోనా వైరస్ మహమ్మారి కలవర పెడుతోంది.

బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ ఖేర్ తల్లి దులారి ఖేర్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.అంతేకాక ఆయన సోదరుని కుటుంబానికి కూడా కరోనా వైరస్ సోకినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఈ న్యూస్ తెలిసిన కొద్ది సేపటికే వైరల్ గా మారింది. కరోనా వైరస్ మహమ్మారి దేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. రోజుకి వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండగా, వందల సంఖ్యలో కరోనా వైరస్ భారిన పడి మృతి చెందుతున్నారు. ఇంకా వాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి లేకపోవడం తో ఈ కేసులు మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.