అసోంకు అండగా నిలిచిన స్టార్ హీరో..

akshay kumar donate 2 crores to flood hit in assam

అసోంలో భారీ వర్షాలు, వరదలతో నిరాశ్రయులైన బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. అసోంను తనవంతుగా ఆదుకునేందుకు అక్షయ్ కుమార్ రూ.2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. వరదల్లో దెబ్బతిన్న ప్రఖ్యాత కజిరంగా నేషనల్ పార్కు కోసం రూ.కోటి, అసోం సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. కోటి చొప్పున మొత్తం రూ.2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ తన అభిమానులు కూడా తోచినంత సహాయం చేయాలని పిలుపునిచ్చాడు అక్షయ్.