గీత పాత్రకు వారెందుకు నో చెప్పారు?

Allu Arjun speech Geetha Govindam Movie audio

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన జంటగా పరుశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. యూత్‌ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ ఈ చిత్రాన్ని చేయడంతో అందరిలో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. దర్శకుడు ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి యూత్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లుగా ట్రైలర్‌ మరియు టీజర్‌లను చూస్తుంటే అనిపిస్తుంది. ఇక ఈ చిత్రం పాటలు సినిమా స్థాయిని పెంచేస్తున్నాయి. ఈ చిత్రం ఆడియో విడుదల సందర్బంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ఈ కథ మూడు సంవత్సరాల క్రితం నేను విన్నాను. వారం రోజుల క్రితం సినిమాను కూడా చూసేశాను, తప్పకుండా ఇదో భారీ బ్లాక్‌ బస్టర్‌ చిత్రం అవుతుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశాడు. ఈ సమయంలోనే హీరోయిన్‌కు సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు.

ఈ చిత్రంలో గీత పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ముగ్గురు నలుగురు స్టార్‌ హీరోయిన్స్‌తో సంప్రదించడం జరిగింది. కాని హీరో మరియు దర్శకుడి కారణంగా వారు నో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో స్టార్‌ హీరోయిన్‌ నటించినట్లయితే బాగుండేది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు భావించారు. అందుకే మూడు నెలల పాటు హీరోయిన్‌ కారణంగా చిత్రాన్ని ఆలస్యం చేశారు. చివరకు గీత పాత్రకు ‘ఛలో’ చిత్రంతో మంచి సక్సెస్‌ను దక్కించుకున్న రష్మిక మందనను ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో రష్మిక పాత్ర ఎలా ఉండబోతుందో అర్థం అయ్యింది. తప్పకుండా రష్మికకు ఇదో మంచి చిత్రం అవుతుందని, ఈ చిత్రాన్ని కాదన్న హీరోయిన్స్‌ కుళ్లుకోవడం ఖాయం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అయితే ఈ చిత్రంలో నటించేందుకు ఆ ముగ్గురు హీరోయిన్స్‌ ఎందుకు నో చెప్పారో అసలు కారణం మాత్రం తెలియాల్సి ఉంది. హీరోయిన్‌ పాత్ర ఏదైనా నెగిటివ్‌గా ఉంటుందా లేదంటే వల్గర్‌గా ఉంటుందా అనేది సినిమా విడుదలయితే కాని తెలియదు.