ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలు కొలిక్కి వస్తున్నాయి. విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్రం (Central Govt) దృష్టి సారించింది. ఇందులో భాగంగా అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే (Amaravati Hyderabad Greenfield Express Highway) పట్టాలెక్కనుంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు రోడ్లు, ఉపరితల రవాణా సత్వర చర్యలను ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. దీంతో తొందరల్లోనే అమరావతి రింగ్ రోడ్డు, హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం అనుమతులు రానుండగా.. ప్రక్రియ ప్రారంభంకానుంది.





