జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ శాంతి ప్రదర్శన పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమై ట్యాంక్బండ్పై ఉన్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద చర్యలను వారు ఖండించారు.