ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్

ప్రభుత్వ రంగానికి చెందిన జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీకి అనుబంధ విభాగం ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌ నుంచి రూ.310 కోట్లు అప్పును వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక దంపతులు తీసుకున్నారు. అయితే వాటిని ఈ దంపతులు తిరిగి చెల్లించ లేదు. దీంతో వారి ఆస్తులను వేలం వేసే దిశగా అడుగులు సాగుతోన్నాయి. కొంత కాలం పాటు కిస్తీలు సక్రమంగానే చెల్లించారు. కానీ గత ఐదేళ్లగా ముఖం చాటేశారు. సంస్థ ప్రతినిధులు పలుసార్లు నోటీసులు పంపి.. వారితో చర్చించింది. కానీ అవి విఫలమయ్యాయి. దీంతో వారి ఆస్తులను వేలం వేసేందుకు ఎల్ఐసీ చర్యలు చేపట్టింది.