ఇవాళ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వేషన్ సెంటర్లో జరుగుతున్న భారత్ సమ్మిట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ… కాళేశ్వరం తన మానస పుత్రిక అని మాజీ సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. కాళేశ్వరం కథ త్వరలోనే అందరికీ తెలుస్తుందని అన్నారు. రీడిజైనింగ్ పేరుతో కాళేశ్వరం చేపట్టి మోసం చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ఒక నాసిరకం ప్రాజెక్ట్ అని విమర్శించారు. తెలివి ఉన్న ఎవరైనా కాళేశ్వరం చేపడతారా అని ప్రశ్నించారు.