భారత్ దెబ్బకు భయపడుతున్న పాక్ ఆర్మీ..

ఉగ్రవాదుల ఏరివేత షురూ అయింది. జమ్ముకశ్మీర్‌లో సెర్చ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి. లోకల్ ఉగ్రవాదులను సైతం వేటాడుతున్నారు సైనికులు. భారతదేశం యాక్షన్‌లోకి దిగడంతో పాకిస్తాన్ సైన్యం భయాందోళనకు గురవుతోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కుటుంబంతో సహా చాలా మంది ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను విదేశాలకు పంపారు. మీడియా వర్గాల సమాచారం ప్రకారం, పాక్ ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను ప్రైవేట్ విమానాల ద్వారా బ్రిటన్, అమెరికాలకు పంపించినట్లు వార్తలు వస్తున్నారు. దీంతో భారత్-పాక్ మధ్య ఏక్షణాన ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మొదలైంది.